హయత్నగర్, జూన్ 23: వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, మునిపంపుల గ్రామానికి చెందిన గాదె యాదయ్య(62), ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి పెద్దఅంబపేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం, ఆర్కేనగర్లో నివాసముంటున్నారు. యాదయ్యకు 10 ఏండ్ల క్రితమే భార్య చనిపోయింది. కాగా.. దిల్సుఖ్నగర్కు చెందిన గుండ్ర నర్సమ్మకు భర్త, నలుగురు కూతుళ్లు ఉన్నారు.. ఆమె.. భర్తను వదిలిపెట్టి.. తొమ్మిది సంవత్సరాలుగా ఆర్కేనగర్లో గాదె యాదయ్యతో కలిసి సహజీవనం చేస్తుంది. యాదయ్య, నర్సమ్మల మధ్య గొడవ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం యాదయ్య మద్యం మత్తులో ఉండగా తలపై రోకలి బండతో మోదింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో యాదయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.