గాజులరామారం, జూన్ 14 : ఓ రోడ్డు ప్రమాదం వల్ల ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్ట దావూద్బస్తీకి చెందిన జావిద్ (30) బంధువైన ఓ చిన్న పాప శ్రీహరి ద్విచక్ర వాహనానికి అడ్డురావడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. దీంతో శ్రీహరి, జావీద్ల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. సాయంత్రం శ్రీహరి, జావీద్ను మాట్లాడుకుందామని బయటకు పిలిచి కత్తితో జావిడ్ మెడ, ఛాతీపై పొడిచాడు. బస్తీవాసులు జావీద్ను ఆటోలో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.