మల్కాజిగిరి, మే 27: రైల్వే ఉద్యోగి విజయ్కుమార్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్మీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం… పీవీఎన్కాలనీకి చెందిన విజయకుమార్ (30) లాలాగూడ రైల్వే లోకో షెడ్డులో ఉద్యోగి. తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను రైల్వే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలో 8న విజయకుమార్ మిర్జాలగూడలోని తన తల్లి ఇంటి వద్ద దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో ఉత్తరఖాండ్లో ఆర్మీ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్రెడ్డి నిందితుడిగా గుర్తించారు. శ్రీనివాస్రెడ్డి, విజయకుమార్ భార్య భవ్యకు దగ్గరి బంధువు. భవ్యను శ్రీనివాస్రెడ్డికి కాకుండా విజయకుమార్ ఇచ్చి వివాహం చేయడంతో మానసికంగా కుంగిపోయాడు. విజయకుమార్ను అడ్డు తొలగించుకుంటే మళ్లీ భవ్యకు తాను దగ్గర కావచ్చని భావించిన శ్రీనివాస్రెడ్డి..దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడిని ఉత్తరఖాండ్లో అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.