కాచిగూడ,ఏప్రిల్ 30: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. బండరాయితో మోది దుండగులు దారుణంగా చంపేశారు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవార రాత్రి గోల్నాక డివిజన్, సుందర్నగర్లోని గ్రేవీ యార్డులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది దారుణంగా చంపేశారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్, ఎస్సైలు లక్ష్మయ్య, సైదులు, క్లూస్టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ప్రకారం అతను ఆదిలాబాద్ జిల్లాలోని టాకీగూడ పోశం ప్రాంతానికి చెందిన ముకుంద్రావు కుమారుడు దేవ్ కాతేకృష్ణ(41)గా గుర్తించారు. హత్య జరిగిన సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.