సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాలలో పురోగతిలో ఉన్న ఎస్సార్డీపీ పనులను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు అధికారులతో కలిసి అర్వింద్ కుమార్ మంగళవారం పరిశీలించారు. షేక్పేట ఓయూ కాలనీ వద్ద ఎస్సార్డీపీ పనులను పర్యవేక్షించిన అర్వింద్ కుమార్ వాటర్ పైపులైన్ను ఇతర చోటికి మార్చి పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్ రెడ్డి, ఎస్ఈలు వెంకట రమణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.