అంబర్పేట, మే 13: కరోనా బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. గురువారం అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట, బాగ్అంబర్పేట, గోల్నాక డివిజన్ల కార్పొరేటర్లు వై.అమృత, బి.పద్మావెంకటరెడ్డి, దూసరి లావణ్యగౌడ్లతో కలిసి ఫీవర్ దవాఖాన, హర్రాస్పెంట, బాగ్అంబర్పేట యూపీహెచ్సీలను ఆమె సందర్శించారు. ప్రధానంగా ఫీవర్లో ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయని ఆర్ఎంవో జయలక్ష్మి, డిప్యూటీ ఆర్ఎంవో చంద్రశేఖర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. దవాఖాన పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏఎంఓహెచ్ డా.హేమలతకు తెలిపారు. గోల్నాక డివిజన్ హర్రాస్పెంటలోని యూపీహెచ్ఎంసీ, బాగ్అంబర్పేట డివిజన్లోని అయ్యప్పగుడి దగ్గర గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని డాక్టర్లు శ్రీవాణి, గీతారాణిలను అడిగారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ .. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారని తెలిపారు. ఆమె వెంట అంబర్పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్, టీఆర్ఎస్ నాయకులు మోతె శోభన్రెడ్డి, దూసరి శ్రీనివాస్గౌడ్, ఆర్కే బాబు, రాము, వీరయ్యగౌడ్, రాముయాదవ్, తిరుపతి, వైద్య సిబ్బంది అనిత, శ్రీలత, మాధురి, రాణి,దేవిక, సుజాత, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.