అడ్డగుట్ట, మే 31 : లాక్డౌన్లో సైతం అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని డి ప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి అన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నాశ్రీనివాస్తో కలిసి మంచినీటి, సీవరేజ్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నక్కమధు, సత్తయ్య గౌడ్, అమర్, కైరంకొండ,ప్రవీణ్, మహ్మద్, గౌస్, సునీత పాల్గొన్నారు.