లండన్: ప్రపంచ నంబర్వన్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్సీడ్ జొకోవిచ్ 6-4, 6-3, 7-6 (9/7)తో డెనిస్ కుడ్లా (అమెరికా)పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం పదిహేడో సీడ్ గారిన్తో జొకో తలపడనున్నాడు. మహిళల విభాగంలో స్వియాటెక్, ప్లిస్కోవా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టారు.
నాలుగేండ్ల తర్వాత వింబుల్డన్ బరిలోకి దిగి మహిళల డబుల్స్లో రెండో రౌండ్కు చేరుకున్న హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా.. మిక్స్డ్ డబుల్స్లోనూ శుభారంభం చేసింది. ఓపెన్ ఎరా గ్రాండ్స్లామ్ చరిత్రలో తొలిసారి రెండు భారతీయ జోడీల మధ్య జరిగిన మ్యాచ్లో అనుభవజ్ఞులైన సానియా-రోహన్ బోపన్న జంట విజయం సాధించింది. శుక్రవారం మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సానియా-బోపన్న ద్వయం 6-2, 7-6 (7/5)తో అంకిత రైనా-రామ్కుమార్ రామనాథన్ జోడీపై నెగ్గింది.