సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఆదివారం జరిగే నిమజ్జనం నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపించాలని శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ఉదయం 08.45 నుంచి ఇవి నడవనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.