సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే భాగస్వామ్యంతో నడిచే మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులకు మంచి స్పందన వస్తున్నది. అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న లోకల్ రైళ్లకు లాక్డౌన్ తర్వాత అన్ని వర్గాల నుంచి ఆదరణ పెరుగుతున్నది. ప్రస్తుతం 55 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నప్పటికీ 60శాతం ఆక్యుపెన్నీ వస్తున్నదని అధికారులు పేర్కొంటున్నారు. రద్దీని బట్టి మిగతా సర్వీసులను కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు