న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. రానున్న విశ్వక్రీడలకు అర్హత సాధించిన అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే మొత్తం 148 మంది వ్యాక్సినేషన్లో పాల్గొనగా 131 మందికి తొలి డోస్, 17 మంది రెండు డోస్ల వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఐవోఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.