ఆర్కేపురం, మార్చి 20 : హైదరాబాద్, రంగారెడ్డి, మహుబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించిన సురభి వాణీదేవి ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బేరి సుభాష్రెడ్డి వాణీదేవికి స్వీట్లు తినింపిచి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలోని అష్టలక్ష్మి అమ్మవారిని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డితో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రులు టీఆర్ఎస్ పార్టీకి పట్టంకట్టడంతో ఆమె పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి బొగ్గారపు దయానంద్గుప్త, శ్యాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.
బడంగ్పేట, మార్చి 20: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో సురభి వాణీదేవిని విజయం వరించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, సురభి వాణీదేవీ, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డికి పూల బొకేలు అందజేశారు. బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, మీర్పేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప, బడంగ్పేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, పెద్ద బావి సుదర్శన్రెడ్డి, పి. శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొలన్ శ్రీనివాస్, బల్వంత్, పుట్టగల్ల సంతోష్కుమార్, రాజ్కుమార్, మల్గారి శ్రీపాల్ రెడ్డి ఉన్నారు.
మహేశ్వరం, మార్చి20: సీఎం కేసీఆర్ పిలుపుతో వాణీదేవి గెలుపు సాధ్యమైందని సర్పంచ్లు మంత్రి సంధ్యరాజేశ్, అంగోత్ రాజునాయక్ అన్నారు. మన్సాన్పల్లి చౌరస్తాలో పెండ్యాల, డబీల్గూడ, రాంచంద్రగూడ, అమీర్పేట్, కల్వకోల్ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శి యాదగిరిగౌడ్, ఎంపీటీసీ స్వప్న రవీందర్, గుత్తి పాండు, మాజీ సర్పంచ్ జాన్రెడ్డి, ఇస్తారి పాల్గొన్నారు.