గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో .. తాజా సమాచారం అందే వరకు బీజేపీ 52 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 28 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అస్సాంలో 82 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 64 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 86 స్థానాల్లో గెలిచింది.