ఎల్బీనగర్, ఆగస్టు 19 : పారిశుధ్య కార్మికులు రాత్రనక, పగలనకా ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కొనియాడారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి రక్షణ దుస్తువులు, కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు.
అన్ని రక్షణ చర్యలను పాటిస్తూ జాగ్రత్తగా విధులను నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో పాటుగా ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్రెడ్డి , ఎస్ఈ అశోక్రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.