కంటోన్మెంట్, మార్చి 10 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభివాణీదేవి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి రసమయి బాలకిషన్ అన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని పికెట్, లాల్బజార్, తిరుమలగిరి ప్రాంతాల్లో బుధవారం ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతను చూపుతుందన్నారు. రాష్ట్రానికి నయా పైసా కేటాయించని బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హ క్కు లేదన్నారు. తెలంగాణ విభజన సమయంలో ఇచ్చి న హామీలను కేంద్రప్రభుత్వం విస్మరించిందని, అయినా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పిచ్చి ప్రేలాపనతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తున్న టీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. అభివృద్ధి జరుగాలంటే ఎన్నికల్లో వాణీదేవిని మండలికి పంపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కు ల మహేశ్వర్రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు నళినికిరణ్, శ్యాం కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, నివేదితా, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, నాయకులు తేజ్పాల్, మురళీయాదవ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి
బొల్లారం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం తిరుమలగిరి హోళీ మేరీ పాఠశాలలో పట్టభద్రుల తో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ విద్యా రం గంలో అపార అనుభవం ఉన్న వాణీదేవిని ఎమ్మెల్సీ గా గెలిపించి మండలికి పంపించాలని ఓటర్లను కోరారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో సురభివాణీదేవికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, టెంపు ల్ ట్రస్ట్ మెంబర్ తేజ్పాల్, మురళీ యాదవ్, కో-ఆప్షన్ సభ్యుడు నరసింహ ముదిరాజ్, నాగేష్, దేవులపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
లాల్బజార్లో వాణీదేవికి మద్దతుగా ప్రచారం..
పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా బుధవారం బోయిన్పల్లి మార్కెట్ డైరెక్టర్ వినీత లాల్బజార్లోని పలు కాలనీల్లో పట్టభద్రులకు కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా వాణీదేవికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.