ముంబై: మహారాష్ట్రలో కఠిన లాక్డౌన్ అవసరం లేదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తున్నారని, రాష్ట్రంలో కరోనా పరిస్థితి మెరుగుపడుతున్నదని చెప్పారు. ప్రజలనుద్దేశించి శుక్రవారం ఆయన టీవీలో ప్రసంగించారు. ఆంక్షలు, లాక్డౌన్ వల్లనే కరోనాను నియంత్రించగలమని ఉద్ధవ్ అన్నారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పది లక్షలకు చేరుతుందని అంచనా వేశామని, అయితే ఇది ఏడు లక్షలుగా ఉన్నదని తెలిపారు. వైద్య సౌకర్యాలను పెంచుతున్నామని, అయితే వైద్య నిఫుణుల కొరత ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో వైద్యపరమైన మౌళిక సదుపాయాలను పెంచామని, అయితే వైద్యులు, నర్సులను ఎక్కడి నుంచి తీసుకువస్తామని ఉద్ధవ్ ప్రశ్నించారు. ఆక్సిజన్ కొరత చాలా ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో 1200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండగా వినియోగం 1700 మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను కేంద్రం సమకూర్చుతున్నదని వివరించారు. కరోనా సెకండ్, థర్డ్ వేవ్లతో ప్రపంచమంతా సతమమవుతున్నదని, మహారాష్ట్రలో పరిస్థితి దీనికి భిన్నం కాదన్నారు.