మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 18 : చిన్నారులకు క్రీడలతో పాటు విద్య చాల అవసరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. ఆదివారం మైలార్దేవ్పల్లిలోని ఇండోర్ స్టేడియంలో ఎస్ఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోలర్ స్కేటింగ్ అసోసియోషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్కేటింగ్లో మైలార్దేవ్పల్లికి చెందిన చిన్నారులు పాల్గొ ని ప్రతిభను కనబరిచినారు. అండర్ 14లో మొదటి స్థానంలో ఎం. సాయిరాజ్, రెండోస్థానంలో ఎం. నితిన్, మూడో స్థానంలో యువరాజ్ జస్వాల్, అండర్ 14బాలికల విభాగంలో ఎస్.మంజరి, ఎంఎస్ గీతామంథాని, లక్ష్మి, అండర్ 9 బాలుర విభాగంలో మొదటి స్థానంలో రిత్విక్రెడ్డి, రెండో స్థానంలో ప్రతిక్ పటేల్, మూడో స్థానంలో సిద్దార్థ మీనా, బాలికల విభాగంలో ఈరాధ్యా, అల్కాఅజిత్, లాస్యాలు ప్రతిభ కనబరిచారు. స్కేటింగ్ మాస్టర్ శంకర్ ఎమ్మెల్యే చేతులు మీదుగా చిన్నారులకు మెడల్స్ను బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులు స్కేటింగ్లో మంచి ప్రదర్శన కనబరిచారని అందుకుగాను పురస్కారాలు దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. చిన్నారులు భవిష్యత్లో క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాతో పాటు క్రీడల్లో రాణించడానికి కృషి చేయాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించే విధంగా ఇండోర్స్టేడియం పూర్తి కావడానికి వస్తున్నదని, మరో ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకేళ్తానని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్ వెంకటేశ్, సారంగి బుచ్చయ్య, రిషివర్థన్, అజిత్, శైలేష్, పాటిల్, రఘువీర్ పాల్గొన్నారు.