మణికొండ, జూలై 7 : దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం నిలుస్తోందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. పట్టణప్రగతి నాల్గవ విడుత కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటికాలనీలో బుధవారం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం గా సీఎం కేసీఆర్ శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. పట్టణ ప్రగతితో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిందన్నారు.
మరోవైపు దేశానికే హరితహారం పథకం దిక్సూచిగా కొనసాగుతుందని తెలిపారు. భావి తరాలకు స్వచ్ఛమైన పర్యవరణాన్ని అందించాలన్న లక్ష్యంతో తెలంగాణకు హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ఆకుపచ్చని తెలంగాణ కోసం సర్కారు పాటుపడుతుందన్నారు. అధికారులు, వార్డు ప్రజాప్రతినిధులు, ఇన్చార్జీలు విధిగా సమన్వయం చేసుకుంటూ పట్టణప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జయంత్, ఆల్కాలనీస్ సమాఖ్య అధ్యక్షుడు సీతారాం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీరాములు, కౌన్సిలర్లు కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా నార్సింగి మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి రాజేంద్రనగర్ డివిజనల్ అధికారి చంద్రకళ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ము న్సిపాలిటీ పరిధిలోని 1,2 వార్డుల్లో ఆమె మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలను నాటాలని కోరారు.