మణికొండ, సెప్టెంబర్ 27 : భారీ వర్షానికి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ ప్రాంతంలో మురుగునీటి కాలువలో వ్యక్తి గల్లంతైన సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్ర మాదం జరిగిన తీరుతెన్నులపై మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్, పోలీస్ ఇన్స్పెక్టర్ మదనం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ జయంత్, డీఈ సాజిద్లను అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న చోట హెచ్చరిక బోర్డులను అమర్చాల్సి ఉండగా ఎందుకు చ ర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. గల్లంతైన వ్యక్తి వివరాలు, బాధిత కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీరాములు పాల్గొన్నారు.