శంషాబాద్, సెప్టెంబర్ 23: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా వైఎన్ఆర్గార్డెన్ లో అంగన్వాడీ పిల్లలకు బాలామృతం, అక్షరాభ్యాసం, గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాకి ముఖ్య అతిథిగా ఎ మ్మెల్యే హాజరై ప్రారంభించారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్ర సూతి మరణాలు లేకుండా భావితరం ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. నిరుపేద కుటుంబాల పేద బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఆరోగ్య లక్ష్మి, నవజాత శిశువుల కోసం అమ్మ ఒడి వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ తన్వి, ఎంపీపీ జయమ్మ, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్, కమిషనర్ సాబేరలి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.