బండ్లగూడ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్కు చెందిన ఇక్బాల్కు రూ. 2 లక్షలు, నర్సింహ్మకు రూ. 32 వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును శనివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరు పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ముజమిల్ అహ్మద్, మహ్మద్సౌకత్, తఫాజుల్ ఉన్నారు.
మైలార్దేవ్పల్లి, సెప్టెంబర్ 18 : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి మైలార్దేవ్పల్లి డివిజన్ మధుబన్ కాలనీలో ఏర్పాటు చేసిన మండపంలో రాజేంద్రనగర్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ సంగిశేట్టి మహేందర్తో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించారు.మండప నిర్వాహకులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అర్జున్గౌడ్, బాలు, రమేశ్, పల్లాటి శ్రీను, సాయిబాబ, శ్రీనాథ్, కిరణ్, దినేశ్, సతీశ్, గోవింద్ రాజు, మహేశ్, నాని, గుంటూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 18 : మదన్పల్లి గ్రామంలోని శనైశ్చరస్వామి ఆలయంలో శనిత్రాయోదశి సందర్భంగా శనివారం శ్రీగిరిపీటం ధర్మకర్త శంకరరాజు ముఖీయా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి తన్విరాజు, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ నీలంనాయక్, మంచర్ల మోహన్రావు, నీరటి రాజు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు గూడల కృష్ణగౌడ్, వెంకటయ్యనాయక్ పాల్గొన్నారు.