మైలార్దేవ్పల్లి, సెప్టెంబర్ 17 : పేదలకు ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం మైలార్దేవ్పల్లి టీఆర్ఎస్ కార్యాలయంలో లక్ష్మీగూడ ప్రాంతానికి చెందిన దీప్తికి రూ. 4 లక్షలు, మరొకరికి రూ. 25వేల ఎల్వోసీని అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్, అడికె అర్జున్, యాదగిరి, యంజాల మహేశ్రాజ్, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
గణనాథుని నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ బస్తీలలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నేతాజీ నగర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నం వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వారి విఘ్నాలను తొలగిస్తాడన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, నాయకులు మాధవరెడ్డి, సుధాకర్, వెంకటేశ్, రాజు, జైపాల్ పాల్గొన్నారు.