శంషాబాద్, సెప్టెంబర్ 14: శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. మంగళవారం శంషాబాద్లోని ఎంపీడీవో కార్యాలయంలో శంషాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రకాశ్గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆయా వార్డులు కౌన్సిలర్లు తమ సమస్యలను సమావేశం దృష్టి తెచ్చారు. రోడ్డు, నీటి సమస్యలు, విద్యుత్, పారిశుధ్యం, వీధి దీపాలు, హరితహారం, డ్రైనేజీ వ్యవస్థ తదితర పలు అంశాలపై సమీక్షించారు. నిధులు, ఆర్థిక వనరుల కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సుష్మారెడ్డి, కమిషనర్ సాబేరలి పాల్గొన్నారు.
మణికొండ, సెప్టెంబర్ 14 : నాయీబ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధి కోసం వృత్తి శిక్షణ వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం మణికొండ,నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో ఐదువందల గజాల స్థలాన్ని కేటాయించేలా చొరవ చూపాలని కోరుతూ మంగళవారం నాయీబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిసి విన్నవించారు. జంట మున్సిపాలిటీలో 200మంది నాయీబ్రాహ్మణలు క్షౌరవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తమ కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారంటూ వివరించారు. అభివృద్ధికి నోచుకోక అందుకు తగిన వసతి లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి నాయీబ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పత్తిప్రవీణ్కుమార్, సంఘ ప్రతినిధులు శ్రీనివాస్, రాం చందర్, శ్యామయ్య, వెంకటేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.