శంషాబాద్ రూరల్, ఆగస్టు 5 : గీతకార్మికులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం ఎక్సైజ్శాఖ, గీత కార్మికుల ఆధ్వర్యంలో చౌదర్గూడ గ్రామంలో ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ గీతకార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. గతంలో గీత కార్మికులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గీత కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కార్మికులు చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందితే వారికి 5 లక్షల బీమా ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌడ కులస్తుల కోసం ఈత మొక్కలను ఇచ్చి, వాటిని పెంచే విధంగా ప్రొత్సహిస్తున్నారన్నారు. గ్రామాల్లో గతంలో ఈత, తాటి చెట్లు అధికంగా ఉండేవని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు, ఎక్సైజ్శాఖ సీఐ శ్రీనివాసులు, ఎంపీడీవో వినయ్కుమార్, ఆర్ఐ సునిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్లు రాజ్కుమార్, దండు ఇస్తారి, స్థానిక గౌడ సంఘం నాయకులు ఆంజనేయులుగౌడ్, రమేశ్గౌడ్ పాల్గొన్నారు.
శంషాబాద్, ఆగస్టు 5 : శంషాబాద్ పరిధిలోని ఊరచెరువు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ నేతృత్వంలో స్థానిక ప్రజాప్రతినిధు లు, నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. చెరువులో నుంచి డ్రైనేజీ మురుగు ఎప్పటికప్పుడూ పారే విధంగా ఏర్పాటు చేయాల్సిన విధివిధానాలపై అధికారులు, స్థానిక వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. మురుగు నిల్వతో శ్మశానానికి, హైవే తో పాటు పరిసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
శంషాబాద్ రూరల్, ఆగస్టు 5 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మండలంలోని పెద్దషాపూర్తండా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ నూతన కమిటీని సర్పంచ్ నీలనాయక్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. టీఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా సభవాత్ దేవ్నాయక్, ఉపాధ్యక్షుడిగా ఎస్ శంకర్నాయక్, ప్రధాన కార్యదర్శిగా వాడిత్య రవివర్మ, కార్యదర్శిగా చందర్, 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారిని ఎమ్మె ల్యే సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, నీరటి రాజు, కేతావత్ రామునాయక్, మహేందర్ నాయక్, టాక్యనాయక్, హిర్యానాయక్, కేస్యనాయక్, మంగ్యనాయక్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.