మణికొండ, జూలై 31 : ప్రజల దాహర్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మిషన్భగీరథ పథకాన్ని యజ్ఞంలా తీసుకుని శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం నార్సింగి మున్సిపాలిటీ గౌలిదొడ్డి గ్రామం లో రూ. 59.92లక్షలతో నిర్మించిన తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను టీఆర్ఎస్ ప్రజలకు అందిస్తుందన్నారు. గౌలిదొడ్డిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సమస్యలు లేకుండా శాశ్వతంగా తీర్చామన్నారు.
నార్సింగి మున్సిపాలిటీకి ఉజ్వల భవిష్యత్ ఉందని మరిన్ని నిధులను తీసుకొచ్చి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇంటింటికీ తాగునీటి అందించడంతో పాటు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలను సర్కారు అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, కౌన్సిలర్లు యా దమ్మ, శివారెడ్డి, అమరేందర్రెడ్డి, పత్తి శ్రీకాంత్, జలమండలి అధికారులు రవీందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్యాదవ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో వట్టినాగులపల్లిలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ రేఖ స్థానిక కౌన్సిలర్ యాదమ్మతో కలిసి అర్హులైన వారికి రేషన్కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులందరికీ మరోసారి రేషన్కార్డులను అందజేస్తున్నదని చైర్పర్సన్ రేఖ అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్, ముత్యంరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, విష్ణువర్థన్, పర్వేదరాజు, కిశోర్యాదవ్, పాపాలాల్సింగ్ పాల్గొన్నారు.