శంషాబాద్, జూలై 27: బడుగు, బలహీన వర్గాలైన పేదలకు ఆహార భద్రత, ఆహార సమస్య లేకుండా చేయడం, సామాజిక భద్రతపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్లోని బేగం ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ చేతుల మీదుగా శ్రీ కారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు 8 వేల రేషన్కార్డుల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. కడపు నిండా అన్నం.. రూపాయకు కిలో బియ్యంతో పేదల కుటుంబాల్లో ఆనందం నింపుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. ప్రభుత్వం కోట్లకు పైగా సబ్సిడీ భారాన్ని భరిస్తూ ప్రజలందరి కడుపు నింపుతోందని తెలియజేశారు.
నిరుపేదలకు ఎలాంటి ఆకలిబాధలు ఉండరాదనే తలంపుతో చేపట్టిన ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా సమష్టి కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు సీఎం కేసీఆర్ అన్నదాతగా నూతన రేషన్ కార్డుల పంపిణీతో భరోసా నింపారని తెలిపారు. అర్హులైన వారందరికీ సవ్యంగా పంపిణీ చేసి కార్డులను పొందినవారు సంతోషంగా జీవించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ జనార్దనరావు, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్వి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ డి.వెంకటేశ్, శంషాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, జూలై 27 : పేదలకు కడుపునింపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి తెలిపారు. గ్రామాల్లోని పేదలకు రేషన్కార్డులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఆకలితో ఉండకుండా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 3 లక్షలకు పైగా నూతన రేషన్కార్డులు మంజూరు చేసి పంపిణీ చేశారని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులకు మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓట్ల కోసం వాడుకొని వదిలేశారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం కార్లు, వ్యవసాయ యంత్రాలు, సెంట్రింగ్ ఇతర పని ముట్లు ఇచ్చి ఆదుకున్నట్లు వివరించారు. టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని దళితులకు మేలు జరుగుతుందన్నారు.