శంషాబాద్ రూరల్, జూలై 20 : సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా పేదలకు ఆరోగ్య భద్రతను ప్రభుత్వం కల్పిస్తున్నదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన వి.కొలయ్యకు రూ. 36వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యమందించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్రావు, సర్పంచ్ సతీశ్యాదవ్, సీనియర్ నాయకుడు మోహన్నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మైలార్దేవ్పల్లి, జూలై 20 : డివిజన్లోని తన నివాసంలో పద్మశాలిపురం బస్తీకి చెందిన నర్సింహారెడ్డికి సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, నాయకులు యాదగిరి, మహేశ్రాజ్ తదితరులు ఉన్నారు.
శంషాబాద్ రూరల్, జూలై 20 : మల్కారం గ్రామ పరిధిలోని కేబిదొడ్డి గ్రామాన్ని సుల్తాన్పల్లిలో కలపాలని కోరుతూ మంగళవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు సుల్తాన్పల్లి సర్పంచ్ దండు ఇస్తారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండలంలోని కేబిదొడ్డి గ్రామం మల్కారం, సుల్తాన్పల్లి గ్రామాలకు అనుబంధంగా ఉందన్నారు. సుల్తాన్పల్లి గ్రామ పరిధిలో కేబిదొడ్డి గ్రామం 75శాతం, మల్కారం గ్రామ పంచాయతీలో 25 శాతం ఉందన్నారు. రెండు గ్రామ పంచాయతీల మధ్యలో అభివృద్ధి నోచుకోని పరిస్థితి ఉందని వివరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. వినతిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ జిల్లా పంచాయతీ రాజ్ అధికారితో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రశేఖర్, మాలకృష్ణ, వీరచారి, డైరెక్టర్ బాల్రాజ్గౌడ్, నాయకులు సుధాకర్గౌడ్, మధు, పాండురెడ్డి, మల్లికార్జున్, గోపాల్, శ్రీనివాస్, వీరేశం, రాము, కశ్వప్కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.