మణికొండ, జూలై 19 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సోమవారం గండిపేట మండలంలో 51 మందికి కల్యాణలక్ష్మి చెక్కు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్కు మరెవ్వరూ సాటిరారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్మన్ రేఖ , కౌన్సిలర్లు శివారెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, జూలై 19 : అమ్మపల్లి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సోమవారం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం అధికారులు, ఆలయ ధర్మకర్తలు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్కుమార్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 400 ఏండ్ల చరిత్ర దేవాలయానికి ఉందన్నారు. ప్రస్తుతం ఆలయ గోపురానికి మరమ్మతులు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తానని, సంబంధిత మంత్రితో మాట్లాడి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకుడు నీరటి రాజు, అర్చకులు సత్యనారాయణశర్మ, అన్వేశ్శర్మ, ఆలయ డైరెక్టర్లు చందన్వెళ్లి శ్రీనివాస్, మహేశ్, నీరటి అశోక్, నీరటి కృష్ణ, నాయకులు విశ్వనాథ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మైలార్దేవ్పల్లి, జూలై 19 : మైలార్దేవ్పల్లిలోని మధుబన్కాలనీ రెడ్డి సంఘం సభ్యులు రెడ్డి సంఘ భవ నం నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని ఎమ్మె ల్యే ప్రకాశ్గౌడ్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. మధుబన్ కాలనీ, పద్మశాలీపురం, టీఎన్జీవోస్ కాలనీల్లో ఏండ్ల తరబడి నివసిస్తున్నామని తెలిపారు. రెడ్డి సంఘానికి టీఎన్జీవోస్ కాలనీలో స్థలం కేటాయిస్తే భవనం నిర్మించుకుంటామని ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు బుచ్చి రెడ్డి, ఉపాధ్యక్షుడు లిక్కి వెంకటేశ్వర్రెడ్డి, కార్యదర్శి భూపతిరెడ్డి, కోశాధికారి నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, పాండురంగారెడ్డి, గౌరవ అధ్యక్షుడు సుఖేందర్రెడ్డి తదితరులు ఉన్నారు