అల్వాల్, ఏప్రిల్ 02 : అల్వాల్ సర్కిల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలసి ప్రారంభించారు. చిన్నన్న తోటపార్క్లో సుమారు రూ. 13 లక్షలతో తలపెట్టిన ఓపెన్ జిమ్ పనులకు శంకుస్థాపన చేశారు. అయ్యప్పనగర్లో రూ.85 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ. 45 లక్షలతో పూర్తి చేసుకున్న భూగర్భ డ్రైనేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాలనీవాసుల అభ్యర్థన మేరకు రూ. 25 లక్షలను కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఢిల్లీ పరమేశ్, నర్ల సురేశ్, రాజయ్య, పాషా, అధికారులు డీఈ మహేశ్, ఎస్ఎస్ జలంధర్ రెడ్డి, మహేందర్, చిన్నన్న తోటవాసులు సూర్యా రావు, బ్రహ్మచారి, అజిత్కుమార్, నర్సింగ రావు, యాదగిరి, కాలనీ వాసులు పాల్గొన్నారు.