ముషీరాబాద్, జూలై 12: హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం గాంధీనగర్ డివిజన్ పీఎన్టీ కాలనీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలు, కాలనీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు కాలనీలు, బస్తీల సంఘాలు కృషి చేయాలని కోరారు. హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ముఠా నరేశ్, ఎర్రం శ్రీనివాస్గుప్త, పోతుల శ్రీకాంత్, ఆకుల శ్రీనివాస్, నర్సింగరావు, యాదగిరి, దేవయ్య, సురేశ్, సి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.