కవాడిగూడ, జూన్ 17: సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలిపారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లకు 30 శాతం వేతనాలు పెంచిన సందర్భంగా టీఆర్ఎస్ భోలక్పూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీలో సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, సీనియర్ నాయకులు జునేద్ బాగ్ధాది, వాహబ్ సాబ్, అబ్ధుల్ రహీం, షరీఫొద్దీన్, భవానీ శంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్, లక్ష్మీగణతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు శంకర్గౌడ్, మక్భూల్, గోవింద్, ముబారక్, సునిల్, జగన్, హాజీపాషా, గోరేబాయ్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.