కవాడిగూడ, మార్చి 9: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్ట భద్రుల నియోజక వర్గం టీఆర్ఎస్ ఎ మ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సురభి వాణీదేవికే అందరూ మద్దతు తెలిపుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. ఆరేండ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ రాంచందర్రావు ముషీరాబాద్కు చేసిందేమీ లేదని అన్నారు. అత్యధిక మెజార్టీతో వాణీదేవిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా భోలక్పూర్లోని ఎస్బీఐ కాలనీలో సురభి వాణీదేవికి మద్దతుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు తమ రాజకీయ లబ్ధి కోసమే ఓట్లకోసం వస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన స్వర్గీయ పీవీ నరసింహారావు కూతురు మంచి విద్యావేత్త అని, ఆమెను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, కరీంనగర్ కార్పొరేటర్ బాల య్య, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, నాయకులు బింగి నవీన్కుమార్, శంకర్గౌడ్, కాలనీ అధ్యక్షుడు రాధాకృష్ణ, లక్ష్మణ్, కేఎమ్ సాయి, సంజీవ్ కుమార్, రఘువీరాగౌడ్, ఆనంద్, మక్భూల్ పాల్గొన్నారు.
చిక్కడపల్లి, మార్చి9: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా మంగళవారం శ్రీనివాస్రెడ్డి రాంనగర్ డివిజన్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో ప్రచారం నిర్వహించారు. వాకర్లను కలిసి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడిచిన ఏడేండ్లలో వ్యవయసాయం రంగం నుంచి ఐటీ రంగం దాకా అన్నింటిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత ప్రభుత్వాని దన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రేశం మల్లేశ్, ప్రకాశ్రెడ్డి, సిరిగిరి శ్యా మ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కిరణ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వివేక్, మధు, సందీప్, విక్కి, జనార్దన్, నాగభూషణం, కిషన్రావు, దామోదర్రెడ్డి, ప్రేమన్న, రమేశ్రెడ్డి పాల్గొన్నారు.
ముషీరాబాద్, మార్చి 9: టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటేసేలా ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం అడిక్మెట్ డివిజన్ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రాంనగర్ ఈ సేవా వద్ద జ రిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ యన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం చేపట్టాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.