ముషీరాబాద్, అక్టోబర్ 20: నూతన డివిజన్ కమిటీల సభ్యులు పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ తమవంతు ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పార్టీ కోసం చురుకుగా పని చేసే, అనుభవం ఉన్న వారికి డివిజన్ కమిటీలలో స్థానం కల్పించామని అన్నారు. బుధవారం రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడు ఆర్ మోజస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం, ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఎస్ఆర్టీ కమ్యూనిటీహాల్లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. త్వరలో జరుగనున్న పార్టీ ప్లీనరీకి ముఖ్య నాయకులు, కమిటీల సభ్యులు విధిగా హాజరుకావాలని కోరారు. ప్లీనరీతో పాటు టీఆర్ఎస్ విజయ ఘర్జన సభలకు అన్ని డివిజన్లను ముస్తాబు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్ మోజస్, ఎర్రం శేఖర్, ముదిగొండ మురళి, వివేక్, ముక్తార్ హుస్సేన్, దామోదర్, కో టేశ్వర్రావు, పాశం అరవింద్ యాదవ్, తులసి, సం పూర్ణ, శోభ, కాడబోయిన నర్సింగ్ప్రసాద్, కిషన్రావు, గండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.