కవాడిగూడ, జూలై 29: కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్బండ్లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద శాశ్వత షెడ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయం వద్ద జరిగే బోనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఏర్పాటు చేసే షెడ్ల నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపా ల్, దేవాదాయ శాఖ ఈఓ కె. సాంబశివరావులతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్ర భుత్వం బోనాలను నిర్వహిస్తున్నదని అన్నారు. శ్రీ కనకాల కట్టమైసమ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉందని, ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత షెడ్లను నిర్మించేందుకు రాజకీయాలకు అతీతంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కలిసి విన్నవిస్తానని ఆయన తెలిపారు. ఆగస్టు 1,2 తేదీలలో జరిగే బోనాలను భక్తులు కరోనా నిబంధనలు పాటించి అత్యంత వైభవంగా జరుపుకోవాలని అన్నారు.
బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ నుంచి మంజూరైన చెక్కును దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కె. సాంబశివరావుకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. రవీందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎస్. యాదగిరి, నగర నాయకులు కల్వ గోపి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాంచందర్, మల్కిరెడ్డి, ముకుందరెడ్డి, శ్రీ లక్ష్మీగణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, పాస్పోర్టు శ్రీనివాస్, ఆలయ కమిటీ సిబ్బంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.