చిక్కడపల్లి, ఏప్రిల్25: డబుల్బెడ్రూం ఇండ్లతో పేదలకు గౌరవం పెరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం లంబాడితాండా బస్తీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల భవనంలో లబ్ధిదారుడు వెంకటేశ్ నాయక్ గృహప్రవేశం చేశాడు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు అందించారని తెలిపారు. గతంలో ఈ బస్తీలో అన్ని గుడిసేలే ఉండేవని, కానీ ఇప్పుడు అతి పెద్ద అపార్ట్మెంట్ నిర్మించి పేదలకు అందించడం జరిగిందని తెలిపారు. చిన్న గుడిసెల్లో సరిపడక బస్తీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు వారికి విశాలమైన ఇండ్లు అందించడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా జైసింహ, బస్తీ అధ్యక్షుడు కల్యాన్నాయక్, రాంనగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. వివేక్, హౌస్ఫెడ్ డైరెక్టర్ కిషన్రావు, దామోదర్రెడ్డి, కోటేశ్వరరావు, కూరగాయల శ్రీను, బస్తీ నాయకులు నవీన్ నాయక్, దేవేందర్, హోబా తదితరులు పాల్గొన్నారు.