కవాడిగూడ/ చిక్కడపల్లి , జూలై 25: ఆషాఢ బోనాల సందర్భంగా కవాడిగూడ డివిజన్లోని స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ దేవాలయంలో పెద్ద ఎత్తున బోనాలను అమ్మవారికి సమర్పించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహతో పాటు పలువురు నాయకులు పాల్గొని అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గోల్గొండ రాజ్కుమార్, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచనశ్రీ, అసోసియేషన్ నాయకులు అఫీజొద్దీన్, చలపతి, బాలనర్సింహ, లవకుమార్, సాయికుమార్, లడ్డూలాల్, శరత్కుమార్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కవాడిగూడ డివిజన్లోని మారుతీనగర్లోని రేణుకాఎల్లమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు ముఖేశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.
అదే విధంగా ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ దోమల రాజు ఆధ్వర్యంలో బోనాల సందర్భంగా నిర్వహించిన ఘటం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు టీఆర్ఎస్ నాయకులు నవీన్గౌడ్ తదితరులు పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో ఆలయ కమిటీ ప్రధాన పూజారి చంద్రమౌళి, ఈఓ సాంబశివరావు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం, ఆనంద్కుమార్, సాయి రాఘవేంద్ర పాల్గొన్నారు.
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి దేవాలయాల్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ శ్రీ వరాలపోచమ్మ దేవాలయంలో అమ్మవారి కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. నాయకులు ముఠా జైసింహ, ముఠా నరేశ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్త, ముచ్చకుర్తి ప్రభాకర్, గుండు జగదీశ్బాబు పాల్గొన్నారు.
గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ శ్రీ వరాల పోచమ్మ దేవాలయంలో అమ్మవారం కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ పావని వినయ్కుమార్ హాజరై అమ్మవారిని దర్శించు కున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు వినయ్కుమార్, దేవాలయం అధ్యక్షుడు ఎ.కనకరాజు పాల్గొన్నారు.