మహిళలు అర్థికంగా రాణించినప్పుడే ఆ కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. మహిళలు ఈ ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని ఆయన సూచించారు. గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ పైభాగంలో కొత్తగా నిర్మించిన మహిళా భవన్లో ఎస్ఆర్డీ, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీల లో ఉచిత శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో అనేక చోట్ల స్వచ్ఛంద సంస్థల సహాయంతో మహిళల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం ఇంట్లో నుంచే వ్యా పారం చేసుకునే విధంగా ఈ సంస్థ ప్రోత్సాహం ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
తల్లి దండ్రులు తమ పిల్లలను చదివించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్పొరేటర్ పావని వినయ్కుమార్ మాట్లాడుతూ.. మహిళలు ఇలాం టి అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలని సూచించారు. ఎస్ఆర్డీ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఉచితంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 వరకు ఒక బ్యాచ్, మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5వరకు మరో బ్యాచ్కు శిక్షణనిస్తామని ఒక్కొ బ్యాచ్కు 25 మంది చొప్పున మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు.