చిక్కడపల్లి, జూలై 23: నగర ప్రజలకు తాగు నీటి పథకంపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నెలకు 20వే ల లీటర్ల ఉచిత నీటి పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజలు నీటి బిల్లులు లేకుండా ఉచిత తాగు నీటి సరఫరా కోసం ప్రతి నల్లా కనెక్షన్కు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీనగర్ డివిజన్ టీఆర్టీ క్వార్టర్లలోని కమ్యూనిటీ హాల్లో ఉచిత నీటి పథకంపై జలమండలి అధికారులు, కార్పొరేటర్లతో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే నెల 15వ తేదీలోపు ప్రతి నల్లా కనెక్షన్కు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని, లేని పక్షంలో బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు. కవాడిగూడ, ముషీరాబాద్, రాంనగర్ కార్పొరేటర్లు రచనశ్రీ, సుప్రియ నవీన్గౌడ్, రవిచారి, జల మండలి జీఎం సుబ్బరాయుడు, డీజీఎంలు చంద్రశేఖర్, వాహబ్, మేనేజర్లు కృష్ణమోహన్, వేణగోపాల్, జ్యోతి, రమణ, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ముఠా నరేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.