కవాడిగూడ, జూన్ 13 : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వ్యాపారాలు చేసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హలో ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీలో శివ వైన్స్ వద్ద తాగుబోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు విన్నవించడంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పద్మశాలి కాలనీలోని శివ వైన్స్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వైన్షాప్ యజమానులు నడుచుకోవాలని, లేని పక్షంలో వైన్స్షాపులను మూసివేసేందుకు చర్యలు తీసకుంటామని ఆయ న హెచ్చరించారు.
ఈ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసకుంటామని ఆయన అన్నారు. అదే విధంగా జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను అడిగి తెలుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అలీ, వై. శ్రీనివాస్రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎ. శంకర్గౌడ్, జునేద్ బాగ్ధాది, ఇమ్రాన్ బాగ్ధాది, భవానీశంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్, శ్రీ లక్ష్మీగణపతి గుడి చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, హనుమాన్ గుడి చైర్మన్ వల్లాల శ్యామ్యాదవ్, హాజీ పాషా, వల్లాల శ్రీనివాస్ యాదవ్, జల మండలి డీజీఎం చంద్రశేఖర్, మేనేజర్ ప్రసాద్బాబు, జీహెచ్ఎంసీ ఏఈ తిరుపతి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.