ముషీరాబాద్, జూలై 5: బస్తీల్లో మురుగు నీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. ఇటీవల డ్రైనేజీ, కలుషిత నీటి సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఎమ్మెల్యే ముషీరాబాద్ డివిజన్ పఠాన్బస్తీ జరజరా హోటల్, బాపూజీనగర్ పార్శిగుట్ట రోడ్డు మార్గంలో జలమండలి జీఎం మహేశ్తో కలిసి పర్యటించి సమస్య తీవ్రతను తెలుసుకున్నారు. కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య మాటిమాటికీ ఉత్పన్నమౌతున్నదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూడు నాలుగు రోజుల్లో డ్రైనేజీ, కలుషిత నీటి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టిసారించి డ్రైనేజీ, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం మహేశ్, డీజీఎం మాధవి, మేనేజర్ నవ్య, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, నర్సింగ్ ప్రసాద్, మల్లేశ్ యాదవ్, డి.శివముదిరాజ్, దీన్దయాల్రెడ్డి, రాజు, ఎయిర్టెల్ రాజు, లక్ష్మణ్గౌడ్, గోవింద్, ముచ్చకుర్తి ప్రభాకర్, సాంబశివరావు, బాబురావు, ఆకుల ఆరుణ్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్, జూలై 5: ముషీరాబాద్ నియోజకవర్గం సాయిచరణ్ కాలనీ, అంజయ్యనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఈ నెల 8వ తేదీన ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాయిచరణ్ కాలనీలో నిర్మించిన 108, అంజయ్యనగర్లో 35 ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. 8వ తేదీ ఉదయం తమ పార్టీ మంత్రుల చేతుల మీదుగా డబుల్ బెడ్రూంలను ప్రారంభింస్తామని, అదేవిధంగా నియోజకవర్గంలో మరిన్ని బస్తీల్లో త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడతామని, ఇండ్లను నిర్మించడానికి అనువైన స్థలాలు ఉండి, స్థానికులు ముందుకు వస్తే నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.
చిక్కడపల్లి, జూలై 5: అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అ న్నారు. సోమవారం గాంధీనగర్ డివిజన్లోని ఆర్ సీ రెడ్డి ఏఐఎస్ స్టడీ సర్కిల్ వద్ద రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అభివృద్ధి పను ల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని అన్నారు. నా యకుడు ముఠా జైసింహ, సర్కిల్-15 డీఈ సన్నీ, ఏఈ శ్రవాణి, టీఆర్ఎస్ నాయకు లు ఎర్రం శ్రీనివాస్గుప్తా, శ్రీ కాంత్, గుండు జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్రావు, ఆకుల శ్రీనివాస్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నాయకుడు ముఠా శివసింహ ఆధ్వర్యంలో గాంధీనగర్లో గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంపిణీని ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, నాయకులు ముఠా జైసింహ, ముఠా నరేశ్, డివిజన్ అ ధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, పోతుల శ్రీకాంత్, లక్ష్మీగణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.