చిక్కడపల్లి, జూన్ 27: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉంద ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఎం.దేవయ్య, ఎస్సీ సెల్ కార్యదర్శి కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం విక్టోరియా కేఫ్ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్కు విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనే క సంక్షేమ పథకాలను అమలు చేసి వాటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, జైసింహ,డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్,ఆకుల శ్రీను, రాకేశ్ కుమార్, మారశెట్టి నర్సింగ్ రావు, రవి శంకర్గుప్తా, జి.వెంకటేశ్, ముఠా శివసింహ, యాదగిరి, విట్టల్ సత్యనారాయణ, జహంగీర్, బన్నీ, హనుమంతు, సంతోష్, ప్రేమ్, భాస్కర్రెడ్డి, యాసీన్ అలీ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.