గాంధీనగర్ డివిజన్లో నేతాజీనగర్ బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం సాయంత్రం నేతాజీనగర్ బస్తీలో ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ లాల్సింగ్, టౌన్ప్లానింగ్ ఏసీపీ పావని తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీలో ప్రజలు 40సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్ర జలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు. ముఖ్యంగా నూతన రోడ్డు నిర్మాణం, నూతన డ్రైనేజీ పైపులైన్ కో సం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారాలుకు సూచించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠానరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, పరుశురాం, రాకేశ్, హన్మంతు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.