ముషీరాబాద్, జూన్ 10: పేదింటి ఆడపిల్లల పెండ్లిల కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. గురువారం రాంనగర్ ఎస్ఆర్టీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ద్వారా మంజూరైన చెక్కులను స్థానిక కార్పొరేటర్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఏటా నియోజకవర్గంలో వందలాది మంది పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో దోహద పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్.సుప్రియ, రవికుమార్, సునీత, రచనశ్రీ, ముషీరాబాద్ తహసీల్దార్ జానకి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శేఖర్, ఆర్.మోజస్, రవీందర్, ముదిగొండ మురళి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్గుప్తా, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.