కవాడిగూడ, మే 27: స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కరోనా రోగు ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మఠా గోపాల్ అన్నారు. గురువారం భోలక్పూర్ డివిజన్ పరిధి రంగానగర్ అంబేద్కర్ కమ్యూనిటీహాల్లో అమన్ వేదిక, యాక్సిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో నిత్యావసర సరుకులను కరోనా రోగుల కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అలీ, వై.శ్రీనివాస్రావు, నాయకులు బింగి నవీన్కుమార్, భవానీ శంకర్ ఆలయ చైర్మన్ ఆర్.శ్రీనివాస్, గోవింద్రాజ్, నవీన్, జబ్బార్, చంద్పాషా, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి: బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న కొవిడ్ ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు గురువారం పాలమూరు అసోసియేషన్ ఆధ్వర్యంలో 100కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, గౌరవ సలహాదారుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్గౌడ్, ఉపాధ్యక్షుడు రిటైర్డ్ డీఎస్పీ రవి కుమార్, ప్రధాన కార్యదర్శి బి.వెంకట్స్వామిగౌడ్, సభ్యులు బాలకిష్ణయ్య, యాదయ్య, శంకర్, టీఆర్ఎస్ నాయకులు నాగభూషణం, జయదేవ్, కూరగాయల శ్రీను, నాగయ్య, జాన్వెస్లీ, సైల్కాబ్ బాబు, పాల్గొన్నారు.
చిక్కడపల్లి,: ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రూపుల దయానంద్ వసంత మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ రూపుల రాజశ్రీ వివేక్ ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లి శ్రీరాంనగర్ బస్తీలో ప్రముఖ సంఘ సేవకుడు రూపుల దయానంద్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు, ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేదలకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా జైసింహ, శ్రీరాంనగర్ బస్తీ అధ్యక్షుడు, రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్, ప్రధాన కార్యదర్శి సిరిగిరి కిరణ్ కుమార్, తెలంగాణ హౌస్ఫెడ్ డైరెక్టర్ కిషన్రావు, దామోదర్రెడ్డి, రాజేంద్రప్రసాద్గౌడ్, నాగభూషణం, మోజెస్, జయదేవ్, కొండమడుగు మధు, శివకుమార్ యాదవ్, ఎం.సత్యనారాయణ, ఆనంద్, సీపీఐ నాయకుడు వెంకట్స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.