అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురుగ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులను కడప జిల్లా గోపవరం మండలం బెడుసునపల్లెకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకి దర్యాప్తు చేస్తున్నారు.