బంజారాహిల్స్,అక్టోబర్ 26: టీఆర్ఎస్ ప్లీనరీలో చర్చించిన అంశాలను, అభివృద్ధి కార్యక్రమాల గురించి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలందరికీ వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నియోజకవర్గం టీఆర్ఎస్ విస్త్రతస్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు,ముఖ్యనాయకులతో సమావేశమైన ఎమ్మె ల్యే మాగంటి సమావేశం నిర్వహణపై సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఒకే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలను ఎక్కడికక్కడే నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమావేశం యూసుఫ్గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల ఎన్నికైన బూత్ స్థాయి, డివిజన్ స్థాయిలో అన్ని కమిటీలకు చెందిన కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. అన్ని కమిటీలతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని, కొత్త కమిటీల అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులకు సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, దేదీప్యరావు, సంగీతయాదవ్ పాల్గొన్నారు.