ఎర్రగడ్డ, సెప్టెంబర్ 25: ఎర్రగడ్డను సమస్యల రహిత డివిజన్గా తీర్చిదిద్ది ఇతర డివిజన్లకు ఆదర్శంగా నిల్చేలా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. డివిజన్లోని ప్రేమ్నగర్లో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన చే శారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారికి తోడు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కొన్ని పనులు పూర్తి కాలేదని.. ఇకపై జాప్యానికి తావు లేకుండా వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు నివాసాలను ముంచెత్తకుండా కాలువల నిర్మాణానికి రూ.14 లక్షలు మంజూరయ్యాయని పనులను త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు.
జనప్రియ టౌన్షిప్కు ఆనుకుని ఉన్న మైదానంలో ప్రభుత్వం తరపున ఫంక్షన్హాల్ నిర్మాణాన్ని చేపట్టి పేద ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు అనువుగా తీర్చిదిద్దుతామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎర్రగడ్డకు అన్యాయం జరిగిందని.. కనీస వసతులకు కూడా నోచుకోలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ, డివిజన్ ప్రధాన, అనుబంధ కమిటీల నేతలు కంజర్ల పల్లవి, జి.రాము, సాయిరూపేశ్, గంట మల్లేశ్, మహ్మద్సర్దార్, మహ్మద్అహ్మద్, ముస్తాక్, మహేందర్జీ, కల్యాణి, సుజాత, రమేశ్, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు.
ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించటానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు కలిసి తమ ప్రాంతానికి నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా అవుతున్నదని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించి జలమండలి అధికారితో మట్లాడి పైప్లైన్ను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కలుషిత నీరు సరఫరా కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.