బంజారాహిల్స్, ఏప్రిల్ 11: టీఆర్ఎస్ పాలనతోనే పేదలకు శ్రీరామరక్ష అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మశంకర్నగర్కు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ పేదలకు అండగా నిలుస్తున్న పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులు వస్తున్నారన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లతో సహా అనేక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గత ఏడాది కరోనా కష్టకాలంలో నియోజకవర్గంలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రత్యేకంగా అన్నదానం కౌంటర్లు ఏర్పాటు చేశామని, పేదలను అన్ని విధాలుగా ఆదుకున్నది తామేనన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఇతర పార్టీలకు చెందిన నాయకులు కనిపిస్తారని, అన్ని వేళలా ప్రజల్లో ఉంటూ వారి కష్టలో పాలుపంచుకుంటున్నది గులాబీ నేతలేనని అన్నారు. కార్యక్రమంలో రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో పాటు టీఆర్ఎస్లో చేరిన మల్లేశ్, రవి, శివ, రామకృష్ణ, రమేశ్, అనిల్, బసప్ప, విజయ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.