వెంగళరావునగర్, సెప్టెంబర్ 16: టీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. గురువారం వెస్ట్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ అధ్యక్షతన డివిజన్ నూతన కమిటీని, అనుబంధ కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిధులతో ఎంతోమంది పేదరోగులకు సాయం అందుతుందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం చెందిందన్నారు. కరోనా సమయంలో ప్రతిపక్షాల నాయకులు కనీసం ఇళ్లల్లోంచి బయటకు రాలేదని.. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడూ తిప్పికొట్టాలన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తిం పు ఉంటుందన్నారు. అనంతరం డివిజన్ కమిటీని ప్రకటించారు. టీఆర్ఎస్ వెంగళరావునగర్ డివిజన్ అధ్యక్షుడిగా అజయ్కుమార్, ఉపాధ్యక్షులుగా అఫ్సర్ ఖాన్, హరీందర్ సింగ్, సురేశ్, బాలరాజు, రాజు, ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్ నియమితులయ్యారు.
వెంగళరావునగర్ డివిజన్కు చెందిన మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ సమక్షంలో బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పార్టీ కండువాలను కప్పి వారిని ఆహ్వానించారు.
షేక్పేట్, సెప్టెంబర్ 16 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. షేక్పేట్లో టీఆర్ఎస్ డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని గుర్తు చేశారు. షేక్పేట్ డివిజన్ అధ్యక్షుడిగా దుర్గం ప్రదీప్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. అనంతరం పార్టీ ప్రధాన కమిటీతో పాటు అనుబంధ కమిటీల ఎన్నికను పూర్తి చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా షకీల్ అహ్మద్, బీసీ కమిటీ అధ్యక్షుడిగా మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా టి.రాజ్కుమార్,ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా ఎల్లేశ్, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా సజ్జాద్, ప్రధాన కార్యదర్శిగా అకీల్ అహ్మద్, మహిళా అధ్యక్షురాలిగా పార్వతి, ప్రధాన కార్యదర్శిగా లత,యువత అధ్యక్షుడిగా బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా షాన్లు ఎన్నికయ్యారు.
జూబ్లీహిల్స్,సెప్టెంబర్ 16 : ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారులన్నీ ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్తో ప్రకాశవంతంగా మారనున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. గురువారం యూసుఫ్గూడ డివిజన్లో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి సెంట్రల్ పోల్ స్ట్రీట్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణానగర్ స్పైసీ హోటల్ నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్లే సత్యసాయి మెయిన్ రోడ్డు వరకు 20 సెంట్రల్ లైట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాత్రి ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా కొత్తగా పోల్స్ వేయడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని, నిమజ్జనం కోసం వెళ్లే వాహనాలకు వీధుల వెంబడి అదనపు లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లికార్జున్, ఏఈ రాజశేఖర్, సర్కిల్ ఇన్చార్జి రాజేశ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్, ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్దాస్, డివిజన్ వార్డు సభ్యులు, ఏరియా సభ సభ్యులు పాల్గొన్నారు.