ఎర్రగడ్డ/ బంజారాహిల్స్/ వెంగళరావునగర్/శ్రీనగర్కాలనీ జూలై 27: బోనాలు సమీపిస్తున్న నేపథ్యంలో బోరబండలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో, శ్రీనగర్కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం, వెంగళరావునగర్ డివిజన్లోని ఆంజనేయస్వామి ఆలయాల ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ.35 లక్షల 42 వేల విలువ గల 77 చెక్కులను అందజేశామన్నారు. బోనాలను ఘనంగా నిర్వహించాలన్నా రు. ఆలయాల వద్ద రెండు రోజుల పాటు తాగునీటిని అందుబాటులో ఉంచాలని జలమండలి అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, సీఎన్ రెడ్డి, దేదీప్య, రాజ్కుమార్ పటేల్, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, దేవాదాయ శాఖ అధికారులు మోహన్బాబు, రవికాంత్, సతీశ్కుమార్, నేతలు సంజీవ, కృష్ణమోహన్, లక్ష్మణ్గౌడ్, ఆలయ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్, జూలై27: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఆయా కమిటీలకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలు ఘనంగా నిర్వహించుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. శ్రీనగర్కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.లక్షా 42 వేల విలువైన ఆరు చెక్కులను యూసుఫ్గూడ డివిజన్కు చెందిన ఆలయ కమిటీలకు అందజేశామన్నారు. కార్పొరేటర్ బండారి రాజ్కుమార్ పటేల్ పాల్గొన్నారు. షేక్పేట్ డివిజన్లోని ఆలయాల నిర్వాహకులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3 ల క్షల 68 వేల విలువైన 8 చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్,బస్తీ సంక్షేమ సంఘం నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.